భారత తలసరి జాతీయోత్పత్తి పెరుగుదల 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం ఉంటుందని అంచనావేస్తున్నారు. అది 2019-20 సంవత్సరానికి 7.5 శాతం పెరగగలదని ఇటీవలి ఐఎంఎఫ్ ‘వరల్డ్ ఎకానమీ అవుట్లుక్’ నివేదికలో ప్రస్తావించింది. ఐఎంఎఫ్ నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటు చైనా కన్నా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్ నివేదిక బట్టి ఆ రెండు సంవత్సరాలలో చైనా వృద్ధి రేటు కేవలం 6.2 శాతం ఉంటుంది.
తగ్గిన చమురు ధరలు భారత్ అభివృద్ధి దిశగా వేగంగా వెళ్లడానికి సహాయపడింది. భారత ఆర్థిక ప్రగతికి ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొన్న మరో కారణం ద్రవ వినియోగ వేగాన్ని మెల్లగా బిగిస్తూ వస్తుండడం. సరిపడినన్ని ఉపాధి అవకాశాలు లేకపోవడం భారత ఆర్థికరంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లల్లో ముఖ్యమైంది. భారతదేశంలో ‘యూనివర్సల్ బేసిక్ ఇంకమ్’ (యుబిఐ)ని ప్రవేశపెట్టడం మీద చర్చ జరుగుతోంది. ఇళ్లదగ్గరకు నగదు బదిలీకి ఇది భరోస ఇస్తుంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు యుబిఐ విధానాన్ని అమలుచేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. యూనివర్సల్ బేసిక్ ఇంకమ్ దిశగా అడుగులు వేయడం భారత ప్రభుత్వం రూపొందించిన సంక్షేమపథకాలకు శక్తివంతమైన ప్రత్యామ్నాయ పాలసీగా భావిస్తున్నారు. అయితే ఈ మార్పిడి ప్రహసనంలో పలు సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కారణం ఆర్థికంగా అంతర్గతమైన అభివృద్ధి ప్రగతి లోపించడం, అలాగే పబ్లిక్ ఫైనాన్స్లో డిజిటల్ మౌలికసదుపాయాలు వంటివాటిని ప్రత్యేకంగా పేర్కొనాలి.
ఈ నెలలో ఐఎంఎఫ్ నివేదిక విడుదలైంది. ఇది ప్రపంచంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. అంతర్జాతీయంగా ఎదురయ్యే సమస్యలతో భారత ఆర్థిక రంగంపై దుష్ప్రభావం పడుతుందన్న అభిప్రాయాన్ని పలువురు ఆర్థికవేత్తలు తిరస్కరించారు. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య పరమైన ఒత్తిడులు ఒకటి. అలాగే చమురు ధరలు అస్థిరంగా ఉండడం రెండవ సమస్య. ఎగుడుదిగుడుగా ఉన్న గ్లోబల్ అభివృద్ధి ప్రతిఫలిస్తున్న అంశాలను ఐఎంఎఫ్ సమీక్షించింది. ఇది 2019లో కేవలం 0.2 శాతం పాయింట్లు ఉంటే, 2020 సంవత్సరానికి 0.1 శాతం పాయింట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రతికూల పవనాలు ముఖ్యంగా సరుకుల మార్కెట్లు, ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి తలెత్తుతున్నాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్పై పడుతున్న ఒత్తిడి ఆలోచించాల్సిన మరో ముఖ్య అంశం. ముఖ్యంగా పెట్టుబడుల ప్రవాహం పరంగా దీనిని చూడాలి. పెట్టుబడుల ప్రవాహం సహజంగా ఇంట్రెస్ట్ రేట్ల తేడాలు, వ్యాపారాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై అమెరికా పెంచిన అధిక టారిఫ్స్ ఎంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే అమెరికా వాణిజ్య రంగంలో ఉన్నత స్థితికి చేరుకుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. అదే సమయంలో ప్రపంచంలోని మిగతా ఆర్థిక వ్యవస్థలు పొందుతున్న లాభాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి. అమెరికాలో ఉపాధి అవకాశాల కల్పన బాగా ఉంటోందని కూడా ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. అలాగే వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసం కూడా అంతే ఉన్నత స్థాయిలో రికార్డు స్థాయిలో అక్కడ ఉంది. భవిష్యత్లో అమెరికా హెచ్చుతగ్గుల సమస్యలను వాణిజ్యం, ఆర్థిక రంగాలలో ఎదుర్కొనబోతోంది .
సుస్థిర ఆర్థిక ప్రగతి సాధనకు ద్రవ్య సంఘటిత స్థితి నాణ్యాతారీతిలో ఉండాలన్నది మరో అంశం. ఈ మధ్య కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) నివేదిక ద్రవ్య సంఘటితత్వం నాణ్యంగా ఉండాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించింది. లేకపోతే దీర్ఘకాలిక స్థూల ఆర్థిక స్థిరత్వం, ప్రగతిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని కాగ్ నివేదిక పేర్కొంది. మరో చర్చనీయాంశ విషయం జిఎస్టీ రేట్లకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పన్నుల సంస్కరణలు. జిఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ) అమలులో బహుళపన్నులు పెద్ద సవాలుగా నిలిచింది. ‘ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్టీసీ కోడ్’ (ఐబిసి) దీర్ఘకాలంలో అభివృద్ధి ప్రమాణాల వేగం కొనసాగేలా భారత్కి సహాయపడాల్సిన అవసరం ఎంతో ఉంది.
భారత దేశంలో సుస్థిర ఆర్థిక అభివృద్ధి పరంగా వ్యవసాయ సంక్షోభం పెద్ద సవాలుగా నిలిచింది. పెరుగుతున్న అంతరాలను తొలగించి నాణ్యమైన ఆర్థిక ప్రగతి నిర్వహణను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైతుల రుణమాఫీ ఒక్కటే మనదేశంలోని రైతుల కష్టాలను తీర్చదు. ఎందుకంటే కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే బ్యాంకింగ్ క్రెడిట్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ట పెట్టుబడుల రేటులో క్షీణత , ముఖ్యంగా వ్యవసాయరంగంలో, బాగా దృష్టిపెట్టాల్సిన అంశం. ఎందుకంటే భారత వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి పథం నిర్వహణలో ఇదెంతో ముఖ్యమైంది. మరెంతో ఆలోచించాల్సిన విషయం. ఫిస్కల్-మానిటరీ పాలసీ సహకారం కూడా భారత సుస్థిర ఆర్థిక ప్రగతికి అత్యావశ్యకమైన విషయం. కేందర 2019-20 బడ్జెట్లో రైతుల రుణాలు, సంబంధిత అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు.
ఐఎంఎఫ్ తన నివేదికను ప్రచురించిన రోజునే బహుళజాతి ప్రొఫెషనల్ ఏజెన్సీ అయిన ‘ప్రైస్వేర్హౌస్-కూపర్స్’ (పిడబ్యుసి) తన నివేదికనూ ప్రచురించింది. అందులో ‘2019 సంవత్సరంలో భారత్, ఫ్రాన్స్ దేశాలు ప్రపంచ అతిపెద్ద ఎకానమీ ర్యాంకింగ్స్ లో ఉన్న యుకెని అధిగమించి ఐదవ స్థానంలో ఉన్న యుకెని గ్లోబల్ టేబుల్లో ఏడవ స్థానానికి నెడతాయని’ పేర్కొంది.
భారత ఆర్థిక మూలాలు బలమైనవి. అంతేకాదు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లను లాఘవంగా, ఎంతో దూరదృష్టితో ఢీకొనగల, ఎదుర్కొన గల శక్తివంతమైన స్థాయిలో ఉంది.
రచన: డా. లేఖా చక్రవర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఐపిఎఫ్పి అండ్ విజిటింగ్ ప్రొఫెసర్ అమెరికన్ యూనివర్సిటీ, వాషింగ్టన్ డిసి