పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మళ్లా విజృంభించింది. ఈ విషయానికి సాక్ష్యం సైతం ఉంది. పాకిస్తాన్ హై కమిషనర్ సోహైల్ మొహమూద్ను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఆల్ పార్ట్సీ హురియత్ కాన్ఫరెన్స్ మిర్వైజ్ ఉమర్ ఫరూక్తో టెలిఫోన్ సంభాషణలు చేసిన అనంతరం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషి భారత విదేశాంగ వ్యవహారాల శాఖలో సమావేశ పరిచారు.
భారత్ ఖురేషి చర్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన చర్యలు భారత్ను బహిరంగంగా వ్యతిరేకిస్తూ రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించింది. ఈ తరహా పాక్ ధోరణులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ వ్యవహార శైలి పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది కూడా. పాకిస్తాన్ అనుసరిస్తున్న పెడధోరణుల్లో పట్టించుకోకుండా వదిలేయాల్సిన చిన్న సమస్యలు సైతం బలమైన సంఘర్షణలకు దారితీస్తున్న అవకాశాలు ఉంటున్నాయి.
ఇస్లామాబాద్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాతో పాకిస్తాన్ సైతం సమావేశం నిర్వహించింది. కశ్మీర్ వేర్పాటుదారులతో దౌత్య, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని పాకిస్తాన్ పునరుద్ఘాటించింది. అంతేకాదు అందులో భాగంగా కశ్మీర్ ప్రాంతాన్ని భారత్తో వివాదాస్పద ప్రాంతంగానే గుర్తించడం కొనసాగిస్తామని వెల్లడించింది. అంతేకాదు పాకిస్తాన్ విదేశాంగమంత్రి మరోసారి సయ్యద్ ఆలి షా గిలానితో టెలిఫోను సంభాషణలు చేయడం వాతావరణాన్ని మరింత విషపూరితం చేశారు.
కశ్మీర్లోని ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ తో అనూహ్యంగా పాకిస్తాన్ సంభాషణలు మొదలెట్టింది. ఇది భారత్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా అది న్యూఢిల్లీతో కర్తాపూర్ షాహిబ్ గురుద్వారా దగ్గరి సిక్కు మందిరం వరకూ రెలిజియస్ కారిడార్ నిర్మాణంపై ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పాక్ సంభాషణలు చేసింది. ఈ గురుద్వారా అమృత్సర్ సమీపంలోని భారత్ సరిహద్దున ఉంది. పంజాబ్ అంతర్గత రాజకీయాలు కూడా రెలిజియస్ కారిడార్ ప్రాజక్టు మీద ప్రభావం చూపాయి. నిజానికి ఈ సమస్యలే లేకపోతే ఈ ప్రాజక్టు ఎంతో అనుకూలమైన అడుగుగా చెప్పాలి.
బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ కశ్మీర్ సమస్యపై చర్చించడం పట్ల భారత్ నిరసన వ్యక్తంచేసింది. అంతేకాదు ఒక సమిష్టి ప్రకటనను కూడా చేపట్టింది. దీనిని ఖురేషి ఒక అనూహ్య ముందడుగుగా అభివర్ణించారు. పాకిస్తాన్ విదేశాంగమంత్రి బ్రిన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైందని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టంచేసింది. బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్తో గాని లేదా లండన్ మేయర్ సాదిక్ ఖాన్తో కానీ సమావేశమయ్యే అవకాశం ఖురేషికి దొరకలేదు. నిజానికి బ్రిటన్ ఖురేషి పర్యటనను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పాలి.
కశ్మీర్ విషయాన్ని తరచూ వివాదాస్పదం చేయడం పాకిస్తాన్ దేశీయ రాజకీయాల్లో అంతర్భాగం. ఇది సహజంగానే భారత్ వేగంగా స్పందించేట్టు చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు భారత్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. తాలిబాన్ బృందంతో చర్చలు అమెరికా సహాయంతో చేపట్టినవే. ఆఫ్ఘనిస్తాన్లో భారత పెట్టుబడుల రక్షణ పరంగా న్యూఢిల్లీ తీవ్రంగా ఆందోళనచెందుతోంది. ఆఫ్ఘనిస్తాన్ అధికార చర్చల్లో ఒకవేళ తాలిబాన్లు పైచేయి సాధిస్తే భారత పెట్టుబడుల విషయం తెరమరుగయ్యే అవకాశం ఉంది.
భారత్, పాకిస్తాన్ల మధ్య అధికారిక సమావేశాలు సమస్యాత్మకమవుతున్నాయి. భారత్లో ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్న సమయంలో ఇది ప్రముఖంగా చర్చల్లో చోటుచేసుకునే అవకాశం ఉంది. భారత పొరుగుదేశాల కన్నా పాకిస్తాన్తో వ్యవహారం భిన్నంగా ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచీ దీనిపైనే న్యూఢిల్లీతో చర్చలు సాగాయి. ఘ భారత పాలసీ రూపకర్తలతో అనుసంధానమయ్యే ప్రయత్నాలు పాకిస్తాన్ నాయకులు చేసినప్పటికీ అవి ఇంకా ఒక రూపుదిద్దుకోలేదు.
దుబాయ్లో సమావేశం జరుగుతోంది. అందులో భారత సీనియర్ రూలింగ్ ఫంక్షనరీలతో పాకిస్తాన్ సమాచార మంత్రి ఫావాద్ చౌధరీ చర్చలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఈ నెలలో కొన్ని సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇస్లామాబాద్లోని మేధావివర్గం కూడా సమాంతర చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒత్తిడులు నియంత్రించే పనిలో ఉన్నారు.
చర్చల్లో పాకిస్తాన్ ను భాగస్వామ్యం చేయడం రాజకీయంగా నష్టపడ్డమే. ఇస్లామాబాద్తో సంభాషణల వైఫల్యం తాలూకూ రిస్కులు మామూలుగా కన్నా కూడా ఈ ఏడాదిలో మరింత తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంభాషణల నిర్వహణ అతి పెద్ద పని. అది మరింత సవాలుతో కూడినది కూడా. 2015 నుంచి బహిరంగ ‘కాంప్రహెన్సివ్ బైలాటరల్ డయొలాగ్’ కోసం భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. కానీ వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్వొసి) లో తరచూ తలెత్తుతున్నచిన్న చిన్న ఘర్షణల వల్ల ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కొనసాగుతున్న తీవ్ర దాడులు కూడా ఒక కారణం. పాక్ రకరకాలు పోకడలు పోతున్న అంతర్జాతీయ దౌత్యాన్ని ఎవ్వరూ భరించడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరాన్ని చెపుతోంది. అంతేకాదు ఇస్లామాబాద్ సరైన చర్యలతో స్పందించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది.
రచన: కల్లోల్ భట్టాఛార్జీ, సీనియర్ ఎడిటర్, ది హిందూ