కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలో ఈరోజు మీడియా యూనిట్ల వార్షిక తొలి సమావేశాన్ని నిర్వహిస్తోంది. జాతీయస్థాయిలో వివిధ విబాగాల్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ – ఐఐఎస్ అధికారులకు ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటుకు ఈ సమావేశం దోహదపడుతుంది. సమాచార రంగంలో వస్తున్న అనేక మార్పులను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈరోజు జరిగే ఈ సమావేశానికి సమాచార ప్రసారశాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ అధ్యక్షత వహిస్తారు.