తొలివిడత లోక్సభ ఎన్నికల అత్యధిక అభ్యర్ధులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కొత్త ఢిల్లీలో సమావేశం జరుపుతోంది. పార్టీ ప్రధాన కార్యలయంలో ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అరుణ్జైట్లీ, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. 91 స్థానాలకు వచ్చేనెల 11న జరిగే తొలివిడత ఎన్నికలకు ఈ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. 543 పార్లమెంటరీ స్థానాలకు మే 19వ తేదీ వరకు జరిగే 7 విడతల ఎన్నికలలో ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది.