సార్వత్రిక ఎన్నికల్లో – ఏదైనా ఉల్లంఘనలపై – సత్వర చర్యలు తీసుకోడానికి వీలుగా – Facebook – WhatsApp – Twitter – Google – ShareChat వంటి సామాజిక మాధ్యమాల వేదిక – అత్యంత ప్రాధాన్యత తో కూడిన ఒక పిర్యాదు యంత్రాంగాన్నీ – అలాగే – ఇందుకోసం – అంకితభావంతో పనిచేసే బృందాలను – నియమించాలని – నిర్ణయించాయి. రాజకీయ ప్రకటనలతో పాటు – Media Certification and Monitoring Committee జారీ చేసిన – ధ్రువపత్రాన్ని కూడా సమర్పించడానికి వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడానికి కూడా అంగీకరిస్తున్నట్లు – ఎన్నికల కమిషన్ తో సమావేశం అనంతరం – వీరు రూపొందించిన స్వచ్చంద నియమావళిలో – పొందుపరిచారు. చెల్లింపు రాజకీయ ప్రకటనల్లో – పారదర్శకతను పాటిస్తామని కూడా – ఆ నియమావళి – హామీ ఇచ్చింది. భారత సామాజిక మాధ్యమాల వేదిక, Internet, Mobile Association – – న్యూఢిల్లీ లో నిన్న- ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా ను కలిసి – తాము రూపొందించుకున్న – స్వచ్చంద నియమావళిని – అందజేసింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడ్డం కోసం – సామాజిక మాధ్యమాల వేదికల నైతిక వినియోగాన్ని కొనసాగించడానికీ – అదేవిధంగా – స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి – ఈ స్వచ్చంద నియమావళిని – రూపొందించారు. ఈ నియమావళి రూపకల్పన పట్ల – అరోరా – సంతోషం వ్యక్తం చేస్తూ – నియమావళిని – తూ చ తప్పకుండా అనుసరించాలని – కోరారు. ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు – మొదటి సారిగా – ఆన్ లైన్ లో ప్రచారానికి – ఇటువంటి స్వచ్చంద నియమావళిని – అమలుచేస్తున్నాయి.