హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సత్తి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సత్ పాల్ సత్తి ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. ఆయన ప్రచారం ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధింపు సమాచారం ఉత్తర్వులను బట్వాడ చేయవలసిందిగా ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాన్ని కోరింది. ఆ రాష్ట్రంలోని సోలన్ జిల్లా రామ్ షహర్ ఎన్నికల ప్రచార సభలో సత్ పాల్ చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయం, తీవ్రమైనవిగా ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.