ఐ.పి.ఎల్. క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గత రాత్రి బెంగళూరులో ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఒక్క పరుగుతో చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలిచింది. జట్టులో MS ధోనీ 48 బంతుల్లో 84 పరుగులు చేశారు. దోనీకి మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ సహకరించకపోవడంతో చెన్నై జట్టు చివరి బంతివరకూ పోరాడి ఒక్క పరుగుతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా ధోనీ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టారు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చెయ్యాల్సిన స్థితిలో ఠాకుర్ను పార్థివ్ పాటిల్ రనౌట్ చేశారు. దీంతో బెంగళూరు జట్టు విజయం సాధించింది.