మే 1, 2019 నాడు సరికొత్త రైవా శకానికి జపాన్ శ్రీకారం చుట్టింది. జపాన్ నూతన సామ్రాజ్యాధినేత నరుహితొ డ్రైశాంథెమమ్ సింహాసనాన్ని అధిష్టించారు జపాన్ చక్రవర్తి 1817న సింహాసనాన్ని పరిత్యజించిన చారిత్రక నేపథ్యంలో ఈ మహత్తర ఘటన చోటుచేసుకుంది. సామ్రాజిధినేత నరుహితొ జపాన్ 126వ సామ్రాజిధినేత.అకిహితో తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన జపాన్ తొలి చక్రవర్తి. యుద్ధానంతర పసిఫిస్ట్ రాజ్యాంగం కింద సింహాసనం ఆయనకు సంక్రమించింది. అలా చక్రవర్తి ఆ దేశానికి ప్రధానమైన చిహ్నమయ్యారు. ఏప్రిల్ 30న ఇంపీరియల్ రాజభవనంలోని ‘పైన’ చాంబర్లో పరిత్యాగోత్సవంతో పాటు కొనసాగింపు ఉత్సవాలు మే ఒకటవ తేదీన జరిగాయి. చక్రవర్తి నరుహితో సామ్రాజ్యాధిపత్య ఉత్సవం అక్టోబర్లో జరపాలని నిశ్చయించారు. ఈ ఉత్సవానికి పలువురు విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. చక్రవర్తి దేశ ప్రజలకు అందించిన సేవలను జపాన్ ప్రధాని షింజో ఎబె ప్రశంసించారు. మరింత ప్రగతిపథంలో జపాన్పయనించాలన్నారు. దేశ భవిష్యత్ శాంతిమయం అయ్యేందుకు జపాన్ పాటుపడాలన్నారు.
కొత్త శకం పేరు పెట్టడం జపాన్ సమాజంలో చాలా ముఖ్యమైన ఘటన. తైకా యుగం ప్రారంభమైన 645 ఎడి నుంచి జపాన్ దీన్ని అనుసరిస్తోంది. అక్కడ శకానికి పెట్టిన పేరు ఆ చక్రమర్తి పాలనా కాలాన్ని తెలుపుతుంది. దీనికి ముందు అంటే ఏప్రిల్ ఒకటిన జపాన్ మంత్రివర్గం కొత్త శకం పేరును నిర్ణయించింది. అదే రైవా. అంటే ‘సౌందర్యవంతమైన సామరస్యం’ అని అర్థం. ఈ పదాన్ని జపాన్ అత్యంత పురాతనమైన కవితా సంపుటి ‘మనోషు’ నుంచి తీసుకున్నారు. ఇది 1200 సంవత్సరాల క్రితం సంకలనం చేసింది. రైవా శకానికి ముందు మూడు దశాబ్దాలు అంటే 1989 నుంచి హైసై ఏప్రిల్ 30, 2019 సామ్రాజ్య పరిత్యాగ ఉత్సవం దాకా కొనసాగింది. దానికి ముందు షోవా శకం ఉంది. అది హైసై శకానికి మార్గం వేసింది. ఇది 64 సంవత్సరాల పాటు అంటే 1926 నుంచి 1989 వరకూ కొనసాగింది. ఇది జపాన్ చరిత్రలో దీర్ఘకాలం కొనసాగిన శక నామం.
రెండు శతాబ్దాల కాలంలో తొలి పరిత్యాగోత్సవం చేసేందుకు 2017లో జపాన్ డైట్ ప్రత్యేక రద్దు చట్టం చేపట్టింది. చక్రవర్తి అకిహితో ఆరోగ్య కారణాలతో పదవీ పరిత్యాగం చేయాలని నిర్ణయించుకోవడంతో జపాన్ పార్లమెంట్ ఈ చట్టం చేపట్టింది. ఈ ఉత్సవంలో, దేశ చిహ్నంగా తాను పోషించిన పాత్రను ఆమోదించినందుకు, తనకు ఎంతో మద్దతును అందజేసినందుకు చక్రవర్తి అకిహితో జపాన్ ప్రజలకు కృతజ్ఘతలను తెలిపారు. ఆయన జపాన్ చక్రవర్తిగా మూడు దశాబ్దాలు ఉన్నారు. ముఖ్యంగా దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షం వహించారు. దేశ ప్రజల పట్ల ఎంతో సహృదయతో వ్యవహరించారు. దేశంలో ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో కూడా చక్రవర్తి జపాన్ ప్రజలకు అండగా నిలబడ్డారు. అంతేకాదు భారత-జపాన్ సంబంధాలు పటిష్టపడేందుకు తన వంతు సేవలను చక్రవర్తి అందించారు. 2013లో చక్రవర్తి అకిహితో మహారాణి మిచికోతో కలిసి న్యూఢిల్లీ, చెన్నైలలో పర్యటించారు. వీరి పర్యటన జపాన్, భారత్ల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను అద్దంపట్టింది. ఇండో-జపాన్ దౌత్య సంబంధాలు మొదలై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జపాన్ చక్రవర్తి, జపాన్ మహారాణి భారత పర్యటన చోటుచేసుకుంది.
హెసై శకం జపాన్కు మిశ్రమ అనుభూతులు అందించింది. హెసై శకం నుంచి నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జపాన్ కొత్త రైవా శకంలోకి ప్రవేశించనుంది. గతించిన దశాబ్దాలు జపాన్ ప్రజలకు ఎన్నో అనుభవాలు మిగిల్చాయి. అంతేకాదు లాభరహితమైన పరిణామాలను కూడా వారు చూశారు.
జపాన్ భారీ సవాలును ఎదుర్కుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గరిష్ట స్థాయి అప్పుల జిడిపి నిష్పత్తిని అది ఎదుర్కొంటోంది. ఆర్థిక అవసరాలు పెరుగుతున్న సమాజం ఒత్తిడిని ప్రతిఫలిస్తాయి. నాల్గవ పారిశ్రామిక విప్లవంలో అత్యాధునిక సాంకేతికపరిజ్ఘానం ఆధునీకరణపై జపాన్ దృష్టిసారిస్తుంది. అధికార పోటీ తీవ్రం కావడంతో భౌగోళవ్యూహాత్మక శక్తి, పాత్రలను శాంతికి అనుకూలంగా ఉండేలా ప్రోయాక్టివ్ కంట్రిబ్యూటర్గా మలచాలి. ప్రపంచ ప్రజల గార్డియన్గా జపాన్ వ్యవహరించాలి. సరళీకృత అంతర్జాతీయ క్రమం కోసం పాటుపడడంలో పైచేయిగా జపాన్ వ్యవహరించాలి. రైవా శకంలో అమెరికాతో స్నేహాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించుకుంది. యుద్ధానంతర చరిత్రలో జపాన్ తీవ్రమైన భద్రతా వాతావరణ సవాలును ఎదుర్కొంటోంది. అందులోనూ ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలలో ముందుకు దూసుకువెళ్లడం, తూర్పు చైనా సముద్రంలో చైనా సముద్ర కార్యకలాపాలు సైతం ఉన్నాయి. భద్రతా పరిస్థితులను పటిష్టం చేయడం ద్వారా అంతర్గత పరిస్థితులతో పాటు బహిరంగ పరిస్థితులను సమతుల్యం చేయడంపై ఒకవైపు దృష్టి సారిస్తూనే, అమెరికాతో అనుకూలమిత్రదేశంగా జపాన్ వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో విశ్వజనీనమైన విలువల ఆధారిత మిత్రదేశాల నెట్వర్కుకు రూపలక్పన చేస్తోంది కూడా.
రచన: డా. తిత్లి బసు, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక విశ్లేషకులు