భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన చేస్తున్నారు. ఐస్ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియాలలో పర్యటించారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక రాజకీయ, ఆర్థిక సంబంధాల పెంపుదల లక్ష్యంగా ఈ పర్యటనలు రాష్ట్రపతి చేపట్టారు. భారత్, ఐస్ల్యాండ్లు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫిషరీస్ కొలాబరేషన్కి సంబంధించి పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాదు సంస్కృతి, సహకారం, అధికారులకు వీసా కేటాయింపులు, యూనివర్సీటీ ఆఫ్ ఐస్ల్యాండ్లో హిందీ ఛైయిర్ ఏర్పాటు కూడా వాటిల్లో ఉన్నాయి. నోర్డిక్ గ్రూప్ దేశాలలో ఐస్ల్యాండ్ కూడా ఒక భాగమే. ఐస్ల్యాండ్ రాష్ట్రపతి రెక్జావిక్ మాట్లాడుతూ సుస్థిరమైన మత్యసంపద, సముద్ర ఆర్థిక వ్యవస్థ, షిప్పింగ్, గ్రీన్ గ్రోత్, ఎనర్జీ, నిర్మాణం, వ్యవసాయరంగాలలో తమ వంతు సహకారం అందజేస్తామని అన్నారు.
ఆర్కిటిక్ కౌన్సిల్కు ఛెయిర్గా ఐస్ల్యాండ్ వ్యవహరిస్తోంది. ఇది అంతర్ ప్రభుత్వాల మధ్య పనిచేసే సంస్థ. ఈ సంస్థ ఆర్కిటిక్లో సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారిస్తుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత సభ్యత్వానికి సైతం ఐస్ల్యాండ్ తన మద్దతును అందిస్తోంది. రాష్ట్రపతి కోవింద్ ఐస్ల్యాండ్ యూనివర్సిటీ విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. ఇండియా-ఐస్ల్యాండ్ ఫర్ గ్రీన్ ప్లానెట్ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ లో భాగస్వామ్యం కావాల్సిందిగా కూడా ఐస్ల్యాండ్ను ఆహ్వానించారు. పారిస్ ఒప్పందం కింద భారత ఒప్పందపడ్డ అంశాల గురించి రాష్ట్రపతి కోవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2022 నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని ప్రమాణం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఇండియా-ఐస్ల్యాండ్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రపతి అక్కడి భారతీయులు, స్నేహితులు ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. ఐస్ల్యాండ్లోని భారత రాయబారి ఆర్మ్ స్ట్రాంగ్ చాంగ్సన్ ఈ విందును ఏర్పాటుచేశారు.
రాష్ట్రపతి కోవింద్ ఐస్ల్యాండ్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ బెర్నేలో ఇండియా-స్విట్జర్లాండ్ కొత్త శకం భాగస్వామ్యంపై ప్రసంగించారు. ఆల్ఫ్స్ తో హిమాలయాలను కలుపుదాం అన్నారు. గ్రీన్ గ్రోత్, బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వినూత్న ఆవిష్కరణలు, స్మార్ట్ సొల్యూషన్స్ వంటి రంగాలలో రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి గుర్తించారు. భవిష్యత్తులో ఇండో-స్విస్ దేశాల మధ్య ఒప్పందాలపై సైతం రాష్ట్రపతి కోవింద్ దృష్టిసారించారు. కొత్త పంథాలో, కొత్త రంగాలలో, కొత్త శక్తితో వీటిని చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం , అత్యంత పెద్ద ప్రజాస్వమ్య వ్యవస్థ గల దేశం కూడా. దీని పట్ల అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఇవన్నీ చారిత్రక ఘటనల నేపథ్యంతో చూశారు. 1896 సంవత్సరంలో స్వామి వివేకానంద ఈ దేశంలో పర్యటించారు. తూర్పు, పశ్చిమాలను కలపాలంటూ సందేశాన్ని ఇచ్చారు. 1931 సంవత్సరంలో నోబల్ బహుమతి గ్రహీత రొమైన్ రోల్లాండ్ ఆహ్వానం మేరకు గాంధీజీ స్విట్జర్లాండ్కు వెళ్లారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి కోవింద్ విల్లెనెవెలో ఆవిష్కరించారు. గాంధీజీ 150వ పుట్టినరోజు ఉత్సవాలను పురస్కరించుకుని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు.
పటిష్టమైన ఆర్థిక సంబంధాలతో భారత-స్విట్జర్లాండ్ సంబంధాలు ఎంతో దృఢంగా కొనసాగుతున్నాయి. భారతదేశంలో 250 స్విస్ కంపెనీలు పనిచేస్తున్నాయి. చెన్నైలో స్విస్ సహాయంతో ఇంటిగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. అది 2015లో వజ్రోత్సవాలను కూడా జరుపుకుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఘానం వల్ల ద్వైపాక్షిక సంబధాలు ఒక రూపు సంతరించుకుంటాయని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. వినూత్న ఆవిష్కరణలలో స్విట్జర్లాండ్ అగ్రగామి అన్నారు. ఆ దేశాన్ని భారత్ స్ఫూర్తిగా తీసుకుంటుందన్నారు. సర్కులర్ ఎకానమీలో స్విస్ సామర్థ్యం ,వనరుల సామర్థ్యం బాగా తెలిసిన స్విస్ సుస్థిర పట్టణ స్పేస్ నిర్మాణాల విషయంలో సహాయపడగలదని అన్నారు. అంతేకాదు మన నదులను పరిశుభ్రం చేయడం నుంచి ఫుడ్ ప్రాసెస్ వరకూ అన్నీ చేస్తుంది’ అన్నారు. రాష్ట్రపతి కోవింధ్ స్విట్జర్లాండ్ బిజినెస్ రౌండ్టేబుల్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవింద్ ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’ లో భారత అభివృద్దిని పేర్కొన్నారు. అంతేకాదు భారత అతిముఖ్యమైన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్మార్ట్ సిటీస్’, ‘డిజిటల్ ఇండియా’, ‘క్లీన్ ఇండియా స్టార్టప్ ఇండియా’ ‘స్కిల్ ఇండియా కార్యక్రమాలలో స్విస్ పాల్గొంటోంది. భారత-స్విట్జర్లాండ్ ట్రియటీ ఆఫ్ ఫ్రెండ్షిప్’ పై రెండు దేశాలు 1948లో సంతకాలు చేశాయి. ఆనాటి నుంచి ఇప్పటికి ఆ సంధి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఆనాటి నుంచి రెండు దేశాలు పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
తన విదేశీ పర్యటనలో భాగంగా చివరిగా స్లోవేనియాని రాష్ట్రపతి సందర్శించారు. ఆ దేశానికి ఒక భారత రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించడం ముఖ్య విశేషం. వేగంగా మార్పులకు గురవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గురించి ప్రస్తావిస్తూ స్లోవేనియా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఘానం పట్ల భారత్ ఆసక్తితో ఉందన్నారు. అంతేకాదు ఆ దేశం సుస్థిర వాణిజ్య విధానాల పట్ల కూడా భారత్ ఆసక్తిని కనపబరుస్తోందన్నారు. వీటితో పాటు ఆ దేశ అధ్యయనం, విజ్ఘానం, నూతన ఆవిష్కరణల సారథ్యం వంటివి భారత దేశం వేగంగా వృద్ధి చెందడానికి తోడ్పడగలవని కోవింద్ అభిప్రాయపడ్డారు. భారత్, స్లోవేనియా ఏడు పరస్పర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పెట్టుబడులు, క్రీడలు,సంస్కృతి, నదీ పునరుద్ధరన (క్లీన్ గంగా మిషన్) శాస్త్ర,సాంకేతిక పరిజ్ఘానం, ప్రమాణాలకు సంబంధించిన పలు కార్యక్రమాలపై కూడా ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. రాష్ట్రపతి కోవింద్ ఇండియా-స్లోవేనియా బిజినెస్ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ నెట్వర్కు ఉన్న దేశం అని కోవింద్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వంపై స్లోవేనియా తన మద్దతును ప్రకటించింది. ఈ నెల తర్వాత స్లోవేనియా ప్రభుత్వం మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని తపాలాబిళ్లను విడుదల చేయనుంది.
రచన: ప్రొఫెసర్ ఉమ్ము సల్మా బావా,
ఛైర్పర్సన్ అండ్ జీన్ మోన్నెట్ ఛైయిర్, సెంటర్ ఫర్ యురోపియన్ స్టడీస్,
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ