ఐక్య రాజయ సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన, జమాత్-ఉద్-దావా – JuD – అధ్యక్షుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి, హాఫిజ్ సయీద్ పై లాహోర్ కోర్టు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనే ఆరోపణలపై అభియోగాలను నమోదు చేసింది. పంజాబ్ పోలీసు కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంటు –CTD- జులైలో సయీద్ ఆయన అనుచరులపై మొత్తం 23 FIRలను నమోదు చేసింది. ఆ అందరిని జ్యుడిసియల్ రిమాండ్’ పై కోట్ లఖ్పాట్ జైలుకు పంపింది. న్యాయమూర్తి ఈ తీర్పును చదివిన సమయంలో సయీద్ కోర్టులోనే ఉన్నారని వార్తలొచ్చాయి. పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయ స్థానం సయీద్’పై అభియోగాలు నమోదు చేసేందుకు డిసెంబర్ 11 తేదీని ఖరారు చేసింది. అయితే, ఇప్పడు, ఇదే తేదీ ఎందుకు? అనేది ప్రశ్న. అలాగే కోర్టు ఆయనపై కేసును సీరియస్’గా విచారిస్తుందా? అనే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పాకిస్థాన్’లో వ్యవస్థల పని తీరు తెలిసిన ప్రతి ఒక్కరూ .. ఇదే ప్రశ్న వేస్తున్నారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్’పై అంతర్జాతీయంగా వత్తిడి పెరుగుతోంది. గ్లోబల్ యాంటి టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్, Financial Action Task Force – FATF- వత్తిడి పెంచుతోంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి- UNSC- వత్తిడి కారణంగానే, పాకిస్థాన్ తప్పనిసరి పరిస్థితులలోనే సయీద్ బ్యాంకు ఖాతాలతో పాటుగా, అయన అస్తులను ఫ్రీజ్’ చేసింది. అయితే, సయీద్ బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలుచేసినప్పటికీ, పాకిస్థాన్ సయీద్ కుటుంబ ఖర్చులకు అవసరమైన మేరకు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునేందుకు అనుమతించాలని UNSCని అభ్యర్ధించింది. FATF వత్తిడికి తోడుగా, హాఫిజ్ సయీద్ భారత దేశంపై దాడి చేయడమే లక్ష్యంగా మత ప్రాతిపదికన ఉగ్ర నిధులు వసూలు చేస్తున్నాడని పేర్కొంటూ, లష్కరే అధినేతపై చర్యలు తీసుకోవాలని భారత దేశం పదే పదే డిమాండ్ చేస్తోంది. అమెరికా కూడా అతడిని పట్టుకున్న వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది.
కాగా, గత అక్టోబర్’లో జరిగిన –FATF- సమీక్షలో,పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఉగ్ర నిధులను, నిధుల అక్రమ రవాణాను పూర్తిగా తుడిచే వేసేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాంటి చర్యలు తీసుకునేందుకు FATF పాక్’కు 2020 వరకు గడవు విధించింది. అంతవరకు పాక్’ టాస్క్ ఫోర్సు – గ్రే జాబితాలో ఉంటుంది. ఈ నేపధ్యంలో, తదుపరి FATF సమీక్షా సమవేశంలో పాకిస్థాన్ను ‘బ్లాక్ లిస్టు’లో పెట్టే అవకాశం ఉంది. ఇప్పడు ఆ ముప్పు నుంచి తప్పించుకినేందుకే,ఉగ్రవాద సంస్థలు నిధులు సమకూరుస్తున్నారు అనే అభియోగాలపై, హాఫిజ్ సయీద్’ పై లాహోర్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఇప్పడు అభియోగ పత్రం దాఖలు చేసింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వారం రోజుల ముందుగా సయీద్’పై అభియోగా పత్రాలు దాఖలు చేయడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఈ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’ తోనూ సమావేసమవుతారు. ఈ కారణంగా కూడా సయీద్ పై అభియోగ పత్రం దాఖలైందని అనుకోవచ్చును. అదే విధంగా పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి వేయాలని గత రెండు సంవత్సరాలుగా అమెరికా పాకిస్థాన్’పై వత్తిడి తెస్తోంది. ఇది కూడా సయీద్’ పై చర్యలకు పాక్ ఉపక్రమించేలా చేసింది.
అభియోగాలను ఎదుర్కునేందుకు హాఫిజ్ సయీద్ సిద్దమవుతుంటే, మరో వంక ఆసక్తికరంగా అయన కుమారుడు తల్హా సయీద్ పై హత్యా యత్నం జరిగింది. గత వారం లాహోర్ శివార్లలో ఒక షాప్ వద్ద ఉపన్యాసం ఇస్తున్న అతనిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక వ్యక్తి చనిపోగా, ఏడుగురు లష్కరే మద్దతుదారులు తీవ్రంగా గాయపడ్డారు. తల్హా సయీద్ సమీప భవిష్యత్’లో తండ్రి స్థానంలో లష్కరే అధ్యక్ష పదవిని చచేపట్టే అవకాశం ఉంది.లష్కర్ నిధులను తల్హా నియంత్రిచడం పట్ల కొందరు ఉగ్ర సంస్థ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. లష్కరేలో అంతర్గతంగా నెలకొన్న విబేధాల కారణంగానే తల్హా పై దాడి జరిగిందని భావిస్తునారు.
సయీద్ అభియోగాలు నమోదు చేయడం పట్ల అమెరికా సంతోషం వ్యక్త పరిచింది. స్వాగతించింది. అయితే,భారత దేశం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గత పాక్ ప్రభుత్వాలు, పాలకులకు భిన్నంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడవలసి ఉంది. గతంలోనూ హాఫిజ్ సయీద్’ను అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు. అయితే, పాక్ అధికారులు అతడిని ఎన్ని సార్లు అరెస్ట్ చేశారో, అన్నిసార్లు బెయిల్’ పై విడుదల చేశారు.
సయీద్’ పై అభియోగాలు నమోదుకు రోజుల ముందు కూడా, డజనుకు పైగా ఉన్న భూ కబ్జా కేసులలో సయీద్’కు బెయిల్ లభించింది.ఈ నేపధ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది అనేది విశ్లేషించవలసి ఉంటుంది. FATF 27 పాయింట్ల ప్లాన్’ కు పాక్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? అంటే, అందుకు పాక్ పాత చరిత్రే సమాధానంగ నిల్సుతుంది. ఇప్పడు ఎలాంటి ఆరోపణలు లేకుండా సయీద్’ను విడుదల చేస్తే, FTFA ఏమి చేస్తుంది? పాక్’ బ్లాకు లిస్టులో పెడుతుందా, అనేది కూడా చూడవలసి వుంది.
రచన: డాక్టర్ జైనాబ్ అఖ్టర్